తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సాహో' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'!

మహేశ్​ 'సరిలేరు నీకెవ్వరు'.. ఆస్ట్రేలియాలోని ప్రీమియర్ షోల్లో 'సాహో' రికార్డును అధిగమించిందని సమాచారం. మొత్తంగా ఓవర్సీస్​లో మిలియన్ మార్క్​ను తొలి రోజే అందుకుందని టాక్.

By

Published : Jan 11, 2020, 6:31 PM IST

'సాహో' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'!
సూపర్​స్టార్ మహేశ్​బాబు

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. ఈరోజు(శనివారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్​ తెచ్చుకొని, అభిమానుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలో ఓవర్సీస్​లో తొలిరోజే మిలియన్ డాలర్ మార్క్​ను అందుకుంది. ఆస్ట్రేలియా 'సాహో' పేరిట ఉన్న ప్రీమియర్స్ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టిందని సమాచారం.

ఓవర్సీస్​లో ప్రీమియర్ షోలు పూర్తి చేసుకొందీ సినిమా. యూఎస్​లో దాదాపు 291 కేంద్రాల్లో ప్రదర్శితమై, $758k గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో 31 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం.. A$232k కలెక్షన్లు సాధించిందట. ఇది 'సాహో' వసూళ్ల కంటే అధికం.

'సరిలేరు...'లో మహేశ్​ ఆర్మీ ఆధికారిగా కనిపించాడు. రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్​రాజ్ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

ABOUT THE AUTHOR

...view details