తెలంగాణ

telangana

మారుతికి 'ఆర్​ఆర్​ఆర్' నిర్మాత భారీ పారితోషకం​..?

ప్రముఖ దర్శకుడు మారుతి, సుప్రీం హీరో సాయిధరమ్​ తేజ్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. తాజాగా ఆర్​ఆర్​ఆర్​ నిర్మాత డి.వి.వి దానయ్యతో మారుతికి ఓ భారీ ఒప్పందం కుదిరిందని సినీ వర్గాల సమాచారం.

By

Published : Dec 9, 2019, 10:33 AM IST

Published : Dec 9, 2019, 10:33 AM IST

rrr movie producer danayya will offer  highest remuneration to the director maruthi
మారుతికి ఆర్​ఆర్​ఆర్ నిర్మాత భారీ పారితోషకం​..?

'ఈ రోజుల్లో', 'బస్​స్టాప్'​ వంటి చిత్రాలతో అడల్ట్​ కంటెంట్​ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి... 'భలే భలే మగాడివోయ్​' సినిమాతో తనపై ఉన్న ఆ ముద్రను పూర్తిగా చెరిపేసుకున్నాడు. ఆ తర్వాత వినోదాత్మక కథలకు కేరాఫ్​గా నిలిచాడు. ప్రస్తుతం సుప్రీం హీరో సాయిధరమ్​ తేజ్​తో 'ప్రతిరోజూ పండగే' సినిమాను తెరకెక్కిస్తున్నాడీ దర్శకుడు. తొలిసారి ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

తాజాగా 'ఆర్​ఆర్​ఆర్'​ నిర్మాత డి.వి.వి దానయ్యతో మారుతి ఓ భారీ ఒప్పందం చేసుకున్నాడని సినీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానయ్య తన కుమారుడ్ని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. ఈ బాధ్యతను మరుతికి అప్పగించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈ దర్శకుడికి రూ.6 కోట్ల భారీ పారితోషకం ఆఫర్​ చేసినట్లు తెలుస్తోంది. మారుతి కెరీర్‌లోనే ఇది అత్యధిక రెమ్యునరేషన్‌ అని చిత్ర సీమలో టాక్​. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలుపెట్టనున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details