తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2019, 4:48 PM IST

ETV Bharat / sitara

హీరో రామ్.. ఆ దర్శకుడితో మూడోసారి

హీరో రామ్.. దర్శకుడు కిశోర్ తిరుమలతో మూడోసారి కలిసి పనిచేయనున్నాడు. సినిమా ఫస్ట్​లుక్, టైటిల్​ను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు.

హీరో రామ్

ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్​'తో భారీ విజయాన్ని అందుకున్నాడు హీరో రామ్. దీపావళి సందర్భంగా తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించాడు. కిశోర్​ తిరుమల దర్శకత్వంలో నటించనున్నట్లు ట్వీట్​ చేశాడు. ఫస్ట్​లుక్​, టైటిల్​ను సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నారు.

హీరో రామ్ ట్వీట్

వీరిద్దరి కాంబినేషన్​లో ఇంతకు ముందు 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలు వచ్చాయి. ప్రేక్షాకాదరణ పొందాయి. అయితే ఇప్పుడు తీయబోతున్న చిత్రం తమిళ హిట్​ 'తడమ్'కు రీమేక్​గా తెరకెక్కనుందని సమాచారం. వీటిపై స్పష్టత రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

ఇది చదవండి: 'సరిలేరు నీకెవ్వరు' కథ లీక్ చేసిన వెన్నెల కిశోర్

ABOUT THE AUTHOR

...view details