తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇంకాసేపు అక్కడే ఉంటే ప్రాణాలు దక్కేవి కావు'

శ్రీలంక కొలంబొలో జరిగిన బాంబు దాడుల నుంచి తృటిలో తప్పించుకుంది సినీ నటి రాధికా శరత్ కుమార్.

By

Published : Apr 21, 2019, 2:17 PM IST

రాధికా శరత్​కుమార్

శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల నుంచి తాను తృటిలో తప్పించుకున్నానని సినీ నటి రాధికా శరత్​కుమార్ తెలిపింది. కొలంబొలోని సినమన్ గ్రాండ్ హోటల్​ బాంబు దాడి జరగడానికి కొంచెం ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పింది.

"శ్రీలంకలో జరిగిన ఘటన షాక్​కు గురిచేసింది. కొలంబొలోని సినమన్ గ్రాండ్ హోటల్​లో బాంబు దాడి జరగడానికి కొంచెం ముందే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఈ పిరికి పంద చర్యను ఖండిస్తున్నాను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" -రాధికా శరత్​కుమార్, సినీ నటి.

శ్రీలంకలో నేడు వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ పర్వదినాన జనాల తాకిడి ఎక్కువగా ఉండే చర్చిలు, ఫైవ్ స్టార్ హోటళ్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

ఇది చదవండి: శ్రీలంకలో వరుస పేలుళ్లు- 140 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details