తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2020, 12:04 PM IST

Updated : Jan 3, 2020, 2:18 PM IST

ETV Bharat / sitara

విక్టరీ వెంకటేశ్​కు జోడీగా ప్రియమణి!

వెంకటేష్ ప్రస్తుతం 'అసురన్​' రీమేక్​లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి కనిపించనున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు.

priyamani
వెంకీ

'ఎవరే అతగాడు' చిత్రంతో తెలుగు తెరపైకి వచ్చిన ప్రియమణి అంటే పెద్దగా తెలియదు. కానీ 'పెళ్లయిన కొత్తలో' చిత్రంలో జగపతిబాబు సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటేష్‌ సరసన కథానాయికగా నటించనుందని సమాచారం.

తమిళంలో ధనుష్‌ నటించిన 'అసురన్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ధనుష్‌ పాత్రని వెంకటేష్, మంజు వారియర్‌ పోషించిన పచ్చయమ్మాల్‌ పాత్రని ప్రియమణి చేయనుందని వార్తలొస్తున్నాయి. ప్రియమణి కూడా తన అంగీకారాన్ని తెలియజేసిందని సమాచారం. అయితే ఇంకా అధికారికంగా సమాచారం బయటకు రాలేదు.

చిత్రానికి సంబంధించిన స్క్రిప్టుని పూర్తిగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా ఉండేలా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుగు సినీవర్గాల నుంచి వినిపిస్తున్న వార్త. సినిమాను ఈనెల్లోనే ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట. అయితే చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనేది ఇంకా తెలియదు.

ఇవీ చూడండి.. ప్రభాస్‌.. మహేష్‌ల దారిలోనే రౌడీ హీరో

Last Updated : Jan 3, 2020, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details