తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రకాశ్ రాజ్ మళ్లీ బడికెళ్లాడు.. ఓటేశాడు!

ప్రకాశ్​రాజ్​కు విచిత్ర అనుభవం ఎదురైంది. 41 ఏళ్ల క్రితం ఏ పాఠశాలలో చదువుకున్నాడో అక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నాడు. జీవితంలో ఇది సరికొత్త ప్రయాణమని ట్విట్టర్లో పేర్కొన్నాడు.

By

Published : Apr 18, 2019, 1:54 PM IST

ప్రకాశ్ రాజ్

పోలింగ్.. ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరుగుతుంటుంది. ఓటు ఉన్నవారు సొంత ఊరిలో చదువుకున్న స్కూల్లోనే ఓటేసే అవకాశముంటుంది. సినీ ప్రముఖులకు ఆ ఛాన్స్​ తక్కువ. కానీ నటుడు ప్రకాశ్​రాజ్​కు ఆ అవకాశం దక్కింది. 41 ఏళ్ల క్రితం ఆయన చదువుకున్న పాఠశాలలోనే ఇప్పుడు ఓటేశాడు.

విచిత్రమేమంటే ఆయన కూర్చున్న తరగతి గదిలోనే తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. దీనిపై ప్రకాశ్​రాజ్​ ట్విట్టర్​లో స్పందించాడు. జీవితంలో ఇది సరికొత్త ప్రయాణమని తెలిపాడు.

"41 ఏళ్లక్రితం నేను చదివిన పాఠశాలలోనే ఇప్పుడు ఓటేశాను. విచిత్రమేమంటే నేను కూర్చున్న తరగతిలోనే ఓటు హక్కు వినియోగించుకున్నాను. అప్పటి మధుర స్మృతులు గుర్తొస్తున్నాయి, జీవితంలో ఇది సరికొత్త ప్రయాణం" - ప్రకాశ్ రాజ్, నటుడు

బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచాడు ప్రకాశ్​ రాజ్.

ABOUT THE AUTHOR

...view details