తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 6:46 AM IST

Updated : Aug 6, 2020, 7:11 AM IST

ETV Bharat / sitara

అయినా 'రాధేశ్యామ్‌' యూరప్​కు పయనం

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్‌' బృందం.. మరోసారి యూరప్​ వెళ్లి మిగిలిన షూటింగ్​ను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

#Prabhas20 Update: Prabhas' next to begin shoot in Europe soon
'రాధేశ్యామ్‌': అయినను యూరప్​కు పోయిరావలే!

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్‌ కోసం యూరప్‌ హైదరాబాద్‌కు వచ్చింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌' కోసం యూరప్‌ తరహా కొన్ని నిర్మాణాల్ని భాగ్యనగరంలో సెట్స్‌గా తీర్చిదిద్దారు. వాటిలో చిత్రీకరణ కోసం సన్నాహాలు చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రభాస్‌, ఆయన బృందం రంగంలోకి దిగబోతోంది. ఇక్కడ చిత్రీకరణ చేసినా, మరోసారి యూరప్‌ వెళ్లనున్నట్టు సమాచారం.

'రాధేశ్యామ్‌' ఫస్ట్​లుక్​

ఇప్పటికే పలుమార్లు అక్కడకు వెళ్లి షూటింగ్​ చేసుకొచ్చిన చిత్రబృందం, మరోమారు వెళ్లేందుకు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. రాజీ పడకుండా సినిమాను తీర్చిదిద్దేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారట. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఇప్పటికే సగభాగానికి పైగా సినిమాను పూర్తి చేశారు. వచ్చే ఏడాదిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Last Updated : Aug 6, 2020, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details