తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాన్వీ కపూర్​ ఫీట్​కు అందరూ ఫిదా

వ్యాయామం చేస్తున్న జాన్వీ కపూర్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్​ చేస్తున్నారు.

By

Published : Aug 17, 2019, 5:34 PM IST

Updated : Sep 27, 2019, 7:35 AM IST

జాన్వీ

'ధడక్' సినిమాతో బాలీవుడ్​లో తెరంగేట్రం చేసిన శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ఆమె వ్యాయామం చేస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే దాన్ని పోస్ట్ చేసింది జాన్వీ ట్రైనర్ నమ్రతా పురోహిత్.

ఇందులో ఇద్దరూ ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన ఫీట్​ ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

జాన్వీ కపూర్, నమ్రతా పురోహిత్

ప్రస్తుతం 'కార్గిల్ గర్ల్', 'రూహ్ అఫ్జా' చిత్రాల్లో నటిస్తోంది జాన్వీ కపూర్. వీటితో పాటే 'లస్ట్​ స్టోరీస్' కొనసాగింపుగా తెరకెక్కనున్న 'ఘోస్ట్​ స్టోరీస్'​లోనూ ప్రధాన పాత్ర పోషించనుంది. జోయా అక్తర్ దర్శకత్వం వహించనుంది.

ఇవీ చూడండి.. జాన్వీ కపూర్​తో కంటిన్యూ కానున్న 'లస్ట్​ స్టోరీస్'

Last Updated : Sep 27, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details