షారుక్ ఖాన్ చాలా విరామం తర్వాత చేస్తున్న చిత్రం 'పఠాన్'. దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్గా ఎంపికవ్వగా.. నటుడు జాన్ అబ్రహం ఇందులో విలన్గా నటించనున్నారు. భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్. యాక్షన్ చిత్రాల్ని అత్యాధునిక హంగులతో ఖర్చుకు వెనకాడకుండా నిర్మించే సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం వల్ల అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఈ చిత్రంలో షారుక్, దీపిక, జాన్ అబ్రహం మధ్య సన్నివేశాలు ఈ చిత్రంలో కీలకంగా నిలవనున్నాయట. అందులోనూ యాక్షన్ సీన్లు మరింత ప్రత్యేకంగా ఉంటాయట. దాని కోసం చిత్రబృందం భారీ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. భారతీయ తెరపై ఇప్పటివరకూ చూడని యాక్షన్ సీక్వెన్స్ ఇందులో ఉంటాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన 'వార్' చిత్రంలో ఆర్కిటిక్ ప్రాంతంలో తీసిన కారు గేమింగ్ సీన్లు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. వాటిని మించేలా 'పఠాన్'లో పోరాట ఘట్టాలు ఉండనున్నాయట. ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు కోసం ఎక్కువ రోజులు చిత్రీకరణ చేయనున్నారు. ఇప్పటికే బుర్జ్ ఖలీఫాలో కొన్ని సన్ని వేశాల చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం.
హాలీవుడ్ యాక్షన్ దర్శకులు..