గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మూడో విడత హరితహారంలో హాస్యనటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. నటి ఉదయభాను విసిరిన ఛాలెంజ్ను స్వీకరించి, తన ఇంటి ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
గ్రీన్ఇండియా ఛాలెంజ్లో 'హాస్యబ్రహ్మ'
ఓ మొక్క నాటి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.. తన వంతు బాధ్యత చాటుకున్నారు.
హాస్య నటుడు బ్రహ్మానందం
మూడో విడత హరితహారంలో భాగంగా ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్, కార్తికేయ, విశ్వక్సేన్, అడివి శేష్, దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఉదయభానుతో పాటు పలువురు సినీ ప్రముఖులు మొక్కలు నాటి, తమ వంతు బాధ్యత చాటుకుంటున్నారు. పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: