తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​లోకి కలర్స్ స్వాతి పునరాగమనం

తెలుగు హీరోయిన్​ స్వాతి.. పెళ్లి తర్వాత నటించేందుకు సిద్ధమైంది. నిఖిల్ హీరోగా నటించనున్న 'కార్తీకేయ' సీక్వెల్​లో కథానాయికగా కనిపించనుంది. మొదటి భాగంలోనూ వీరిద్దరే కలిసి నటించారు.

By

Published : Apr 20, 2019, 10:26 AM IST

టాలీవుడ్​లో కలర్స్ స్వాతి పునరాగమనం

యాంకర్​గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్​గా మారి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాతి. టాలీవుడ్​లో పలు హిట్ చిత్రాల్లో నటించింది. కోలీవుడ్​లోనూ విభిన్న పాత్రల్లో మెప్పించి ఆకట్టుకుంది. ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు.

త్వరలో నిఖిల్ హీరోగా తెరకెక్కనున్న 'కార్తీకేయ' సీక్వెల్​లో స్వాతి నటించనుందని సమాచారం. ఈ సినిమా మొదటి భాగంలో వీరిద్దరే జోడిగా కనిపించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నాడు. నాగచైతన్యతో తీసిన గత చిత్రం 'సవ్యసాచి' ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడీ డైరక్టర్.

ఇది చదవండి: 'క్రికెటర్ అర్జున్​గా నాని అదరగొట్టేశాడు'

ABOUT THE AUTHOR

...view details