తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీలో విశ్వక్​సేన్​ 'పాగల్'​-విశాల్​ కొత్త సినిమా

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో విశ్వక్​ సేన్​, అజయ్​దేవగణ్​, సంతోష్​ శోభన్​, ఆది, విశాల్​, సాయిధరమ్​ తేజ్​ కొత్త సినిమా వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

By

Published : Sep 1, 2021, 4:06 PM IST

cinema updates
సినిమా అప్డేట్స్​

ఓటీటీలో 'పాగల్'​

విష్వక్‌సేన్‌, నివేదా పేతురాజు జంటగా నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పాగల్‌'. ఇటీవల విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 3న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్‌లలో విడుదలైన నెల రోజులోపే నెటిజన్లను అలరించేందుకు వస్తుండటం విశేషం.

రష్యాకు అజయ్​ దేవగణ్​

'భుజ్‌' చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజయ్‌దేవ్‌గణ్‌ తన మిగిలిన చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. 'శివాయ్‌' తర్వాత ఆయన నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మేడే'’. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను రష్యాలో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణకు ముందే రష్యాకు వెళ్లి అక్కడ లోకేషన్లు ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్, బొమన్‌ ఇరానీలు పాల్గొననున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నారు.

సింగిల్​ సుపుత్రుడు

యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌ నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ప్రేమ్‌ కుమార్'. రాశీ సింగ్‌ కథానాయిక. అభిషేక్‌ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 'సునందగారి సింగిల్‌ సుపుత్రుడు.. సుందర లింగానికి సోలో స్నేహితుడు..' అంటూ మొదలైన ప్రచారం చిత్రం ఆకట్టుకుంటోంది. అనంత్‌ సిర్కార్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శివప్రసాద్‌ పన్నీరు నిర్మిస్తున్నారు.

ఆది-అతిథి దేవోభవ

హీరో ఆది నటిస్తున్న కొత్త సినిమా 'అతిథి దేవోభవ'. బుధవారం దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్​ పోస్టర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్​ దర్శకత్వం వహిస్తుండగా.. నువేక్ష హీరోయిన్​గా నటిస్తుంది. శేఖర్​ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

ఆది అతిథి దేవోభవ

విశాల్​ కొత్త సినిమా

కోలీవుడ్​ హీరో విశాల్​ 32వ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వినోద్​ కుమార్​ దర్శకుడు. సునైనా హీరోయిన్​. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేసింది చిత్రబృందం.

'నారప్ప' ఫుల్​ వీడియో సాంగ్​

ప్రియమణి-వెంకటేశ్​ నటించిన 'నారప్ప' సినిమా ఇటీవీల ఓటీటీలో విడుదలై విజయవంతంగా స్ట్రీమింగ్​ అయింది. ఇప్పుడు ఈ చిత్రంలోని 'తల్లి పేగు' ఫుల్​ వీడియో సాంగ్​ను రిలీజ్​ చేశారు.

థ్యాంక్యూ కలెక్టర్​

"స్వదేశీ శత్రులతో దేశాన్ని కాపాడేందుకు ప్రతిరోజు కలెక్టర్లు పోరాడుతూనే ఉన్నారు. వారిలో జయించిన వారు ఉన్నారు మరణించిన వారు ఉన్నారు. వారి కథలను సెప్టెంబరు 8నుంచి 'థ్యాంక్యూ కలెక్టర్'​ పేరుతో మీ ముందుకు తీసుకొస్తున్నాం" అని మెగాహీరో సాయిధరమ్​ తేజ్​ ఓ వీడియోను రిలీజ్​ చేశారు.

త్వరలోనే సాయి పొలిటికల్ థ్రిల్లర్ సినిమా 'రిపబ్లిక్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో పంజా అభిరామ్​ అనే ఐఏఎస్ అధికారిగా సాయి కనిపించనున్నాడు. ఐశ్వర్య రాజేశ్​ హీరోయిన్. దేవాకట్టా దర్శకుడు. అక్టోబరు 1న థియేటర్లలోకి రానుందీ సినిమా.

అద్భుతం

ఇదీ చూడండి:రవితేజ కాల్​ చేస్తే.. ఆ నటుడు గుర్తు పట్టలేదట!

ABOUT THE AUTHOR

...view details