తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2020, 10:26 AM IST

Updated : Feb 28, 2020, 12:12 PM IST

ETV Bharat / sitara

మొన్న మోదీ.. నిన్న రజనీ.. నేడు అక్షయ్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ డిస్కవరీ ఛానెల్లో రాబోతున్నాడు. ప్రసిద్ధ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' ప్రోగ్రామ్ కోసం ఇతడు బేర్ గ్రిల్స్​తో కలిసి ఈరోజు నుంచి షూటింగ్​లో పాల్గొననున్నాడు.

Akshay Kumar
Akshay Kumar

మొన్న ప్రధాని మోదీ.. నిన్న రజనీకాంత్.. నేడు అక్షయ్ కుమార్.. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'​లో పాల్గొన్న, పాల్గొనబోతున్న వారి పేర్లివి. ఇప్పటికే మోదీ, బేర్ గ్రిల్స్​ షో ప్రసారం కాగా.. రజనీకాంత్ ఇటీవలే షూటింగ్​లో పాల్గొన్నాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.

కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్​లో ఈరోజు షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్రీకరణలో బేర్ గ్రిల్స్​తో పాటు అక్షయ్ కుమార్ పాల్గొననున్నాడు. ఈ షో డిస్కవరీ ఛానెల్లో 'వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్'​ పేరుతో ప్రసారం కానుంది.

Last Updated : Feb 28, 2020, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details