తెలంగాణ

telangana

By

Published : May 19, 2021, 6:42 PM IST

ETV Bharat / sitara

సీఎం రిలీఫ్​ ఫండ్​కు ఐశ్వర్య, నిధి విరాళం

కొవిడ్​పై పోరాటంలో మద్దతుగా నిలిచేందుకు స్టార్​ హీరోయిన్లు ఐశ్వర్యారాజేశ్​, నిధి అగర్వాల్​ ముందుకొచ్చారు. కరోనా బాధితులను ఆదుకునేందుకుగానూ తమిళనాడు సీఎం రిలీఫ్​ ఫండ్​కు చెరో లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు.

Aishwarya Rajesh and Niddhi Agerwal contributes each one rs1 lakh to cm public relief fund
సీఎం రిలీఫ్​ ఫండ్​కు ఐశ్వర్య, నిధి విరాళం

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం దాదాపు 3 నుంచి 4 లక్షల కేసులు, 4వేల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కథానాయికలు ఐశ్వర్యారాజేశ్​, నిధి అగర్వాల్‌ తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఇప్పటికే ఎంతోమంది తమిళ సినీ ప్రముఖులు సైతం తమవంతు సాయంగా కొవిడ్‌పై పోరాటానికి విరాళం అందజేశారు. ఇటీవల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 50 లక్షలు, వైవిధ్య నటుడు విక్రమ్‌ 30 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చారు. ఇప్పటికే అజిత్, సూర్య, కార్తీ, జయం రవి, ఎఆర్ మురుగదాస్, దర్శకుడు శంకర్ విరాళాలు ఇచ్చారు.

ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్​ తెలుగులో నానితో కలిసి 'టక్‌ జగదీష్‌', సాయిధరమ్‌ హీరోగా వస్తున్న 'రిపబ్లిక్‌'లో నటిస్తోంది. తమిళంలో 'ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌' అనే సినిమా చేస్తోంది. నిధి అగర్వాల్‌ - పవన్‌తో కలిసి 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది.

ఇదీ చూడండి..సైక్లోన్​ తౌక్టే ఫొటోషూట్​తో నటి.. నెటిజన్ల ఆగ్రహం!

ABOUT THE AUTHOR

...view details