యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు రక్షించారు. ఓ యువకుడు రైల్వే ట్రాక్పై పడుకుని ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని రక్షించారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని కాపాడిన పోలీసులు - ఆత్మహత్య చేసుకోడానికి యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
ఆత్మహత్య చేసుకోడానికి యత్నించిన ఓ యువకుడిని బీబీనగర్ పోలీసులు కాపాడారు. రైల్వే ట్రాక్పై పడుకున్న యువకుడిని రక్షించి... కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో జరిగింది.
![ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని కాపాడిన పోలీసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని కాపాడిన పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10423561-thumbnail-3x2-bbnagar-police-rk.jpg)
మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన నాగరాజు... కుటుంబ కలహాల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోడానికి రైల్వేట్రాక్పై పడుకున్నాడు. అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడిని కాపాడి... పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువకుడిని కాపాడిన కానిస్టేబుళ్లు హరినాయక్, సైదులును రాచకొండ సీపీ, భువనగిరి జోన్ ఇంఛార్జి డీసీపీ యాదగిరి అభినందించారు.
ఇదీ చూడండి:తల్లీ, కుమార్తె ఆత్మహత్య... కుటుంబ కలహాలే కారణమా?