తెలంగాణ

telangana

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. వ్యక్తి దుర్మరణం

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు.

By

Published : Aug 13, 2020, 10:35 AM IST

Published : Aug 13, 2020, 10:35 AM IST

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు.. వ్యక్తి దుర్మరణం
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు.. వ్యక్తి దుర్మరణం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నాగార్జునసాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్​ నుంచి మాల్ వెళ్తున్న కారు( ఏపీ 1 ఈఎన్​6156)... అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని(ఏపీ 29 ఎన్​ 5816) ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్​ మీద వెళ్తున్న కృష్ణా రెడ్డి(55)అక్కడికక్కడే మృతి. మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details