తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2020, 12:30 PM IST

Updated : Oct 24, 2020, 1:39 PM IST

ETV Bharat / jagte-raho

స్థలవిషయంలో రెండు వర్గాల మధ్య వార్​.. అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్​ మారేడుపల్లి రెవెన్యూ కార్యాలయం సమీపంలో స్థల వివాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలు ఆ స్థలం నాదంటే నాది అని... గొడవకు దిగారు. దీనితో సమాచారం అందుకున్న పోలీసులు... గొడవను సద్దుమణిగించారు.

Conflict between two factions on earth at Maredupally Revenue Office in Hyderabad
స్థలవిషయంలో రెండు వర్గాల మధ్య వార్​.. అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్​ మారేడుపల్లి రెవెన్యూ కార్యాలయం... తుకారాంగేట్​ పోలీస్​స్టేషన్​ల వెనుకవైపు మహేంద్రాహిల్స్​ సర్వే నంబరు 74/9, 74/10ల మధ్య వివాదం 74/9 స్ధలం చుట్టు ప్రహారిగోడను కూల్చివేసేందుకు హరిరాం ప్రచార సమితి సభ్యులు జేసీపీతో వచ్చారు. ఈ స్ధలం నాది అంటూ స్ధల యజమాని గొడవకు దిగారు. దీనితో దాదాపు మూడు గంటల పాటు ఉద్రికత్తత ఏర్పడింది.

స్థలవిషయంలో రెండు వర్గాల మధ్య వార్​.. అడ్డుకున్న పోలీసులు

ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే పోలీస్​స్టేషన్‌ వెనుక వైపు ఇంత గొడవ జరుగుతుంటే పోలీసులు ఆలస్యంగా వచ్చారు. ఎమ్మార్వో సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల ఆందోళన ఎక్కువైంది. స్ధల యజమాని.. ట్రస్ట్‌ అధ్యక్షుల మధ్య స్ధలం కోసం మాటల యుద్దం నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున జేసీబీలతో 74/9లో ఉన్న ప్రహరీగోడల్ని ట్రస్ట్‌ సభ్యులు కూల్చివేసేందుకు వచ్చారు.

ఈ స్ధలం పక్కనే మహేంద్రాహిల్స్‌ కల్లు కాంపౌండ్‌ షెడ్డులను కూల్చివేశారు. దానితో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఎల్లప్ప రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఒకరునొకరు ఫిర్యాదు చేసుకోవాలని ఈ స్ధలం ఎవరిదో ఎమ్మార్వో ద్వారా విచారణ చేయిస్తామన్నారు. ఎవరైనా గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ఇదీ చూడండి:-ముఫ్తీ 'జెండా' వ్యాఖ్యలపై భాజపా ఫైర్​

Last Updated : Oct 24, 2020, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details