తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2021, 10:25 AM IST

ETV Bharat / jagte-raho

మద్యం మత్తు: ఢీకొట్టిన బైక్.. మహిళ సహా బైకర్​ మృతి

మద్యం మత్తు ఇద్దరి ప్రాణాలు తీసింది. తాగిన మైకంలో అతి వేగంగా బైక్ నడుపుతూ మహిళ మృతికి కారణమయ్యాడు ఓ యువకుడు. ప్రమాదంలో మహిళతో పాటు అతడు కూడా అక్కడిక్కడే మృతి చెందాడు.

2 members died in the  road accident at shamshabad mandal in rangareddy district
నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన బైక్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తుప్పర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. బైక్​ ఢీకొన్న వేగానికి మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

అనంతరం యువకుడి వాహనం.. సమీపంలోని విద్యుత్​ స్తంభాన్ని గుద్దింది. తీవ్రగాయాలైన యువకుడు కూడా ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details