తెలంగాణ

telangana

ETV Bharat / international

మార్కెట్లో బాంబు పేలుడు- 30 మంది మృతి

ఇరాక్​లో జరిగిన బాంబు పేలుడులో 30 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పవిత్రమైన బక్రీద్​ (ఈద్-అల్​-అదా) పండగ ముందు రద్దీగా ఉండే మార్కెట్​ ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది.

By

Published : Jul 19, 2021, 11:15 PM IST

Updated : Jul 20, 2021, 7:32 AM IST

bomb blast
బాంబు పేలుడు

ఇరాక్​ బాగ్దాద్ నగర శివారులో జరిగిన బాంబు పేలుడులో 30 మంది మృతి చెెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని అధికారులు తెలిపారు. పవిత్రమైన బక్రీద్​ (ఈద్-అల్​-అదా) పండగ ముందు రద్దీగా ఉండే మార్కెట్​ ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. రద్దీ మార్కెట్లలో పేలుడు జరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.

పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ ఇటీవల నగరంలో జరిగిన వరుస పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్​ స్టేట్​ గతంలో ప్రకటించింది.

ఇదీ చదవండి:భారత్​ ఆస్తులే లక్ష్యంగా.. పాక్​ మరో కుట్ర

Last Updated : Jul 20, 2021, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details