తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2020, 9:29 AM IST

ETV Bharat / international

ఈయూతో ఒప్పందం ఉండకపోవచ్చు: బోరిస్​

బ్రెగ్జిట్​ అనంతరం వాణిజ్య ఒప్పందాలపై బ్రిటన్​-ఈయూల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ హెచ్చరించారు. డిసెంబర్​ 31న చర్చల గడువు ముగుస్తున్న నేపథ్యంలో బోరిస్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

UK PM warns of no trade deal with EU
'బ్రెగ్జిట్​ వాణిజ్య చర్చలు విఫలమవుతాయి'

బ్రెగ్జిట్​ అనంతరం బ్రిటన్​-ఈయూల మధ్య జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​. చర్చలు విఫలమయ్యే అవకాశం ఎక్కువగా హెచ్చరించారు. ఈయూతో వాణిజ్య ఒప్పందం ఏర్పడేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. చర్చలపై అంతిమ ఫలితాన్ని స్వాగతించేందుకు వ్యాపారవేత్తలు, ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.

"చర్చలకు మేము ఈయూకు​ చాలా సహకారం అందించాం. అన్ని అంశాల్లో పురోగతి సాధించేందుకు తీవ్రంగా శ్రమించాం. ఈయూతో గడువు ముగిసే వరకు చర్చలను కొనసాగిస్తాము. ఆస్ట్రేలియా లాగే.. బ్రిటన్​ సైతం ఈయూతో.. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు లోబడి వాణిజ్యం చేసేందుకే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి."

--బోరిస్​జాన్సన్​​, బ్రిటన్​ ప్రధాన.

బ్రసెల్స్​లో బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​, యూరోపియన్​ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డర్​ లియెన్​ల ​మధ్య బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే రానున్న రోజుల్లో చర్చలను కొనసాగించేందుకు ఇరు వర్గాల నేతలు సుముఖత వ్యక్తం చేశారు.

డిసెంబర్​, 31న ఇరు వర్గాల మధ్య వాణిజ్య చర్చలు ముగుస్తున్నందు వల్ల రానున్న రోజుల్లో జరిగే చర్చలు కీలకంగా మారనున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ఇరు వర్గాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు లోబడి వాణిజ్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి :'బ్రెగ్జిట్ కీలక అంశాలపై చర్చలు కొనసాగించాలి'

ఇదీ చదవండి :బ్రెగ్జిట్​ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు

ABOUT THE AUTHOR

...view details