తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండు యుద్ధ విమానాలు ఢీ... ఓ పైలట్​ మృతి

జర్మనీకి చెందిన రెండు వైమానిక దళ యుద్ధ విమానాలు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ పైలట్​ ప్రాణాలు కోల్పోయాడు. మరో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

By

Published : Jun 25, 2019, 5:30 AM IST

యుద్ధ విమానాలు ఢీ.

రెండు వైమానిక దళ యుద్ధ విమానాలు ఢీ కొన్న ఘటనజర్మనీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ పైలట్​ ప్రాణాలు కోల్పోయాడు. మరో పైలట్ పారాచూట్​ సాయంతో సురక్షితంగా బయటపడ్డాడని అధికారు వెల్లడించారు. యుద్ధ విమానాల్లో వైమానిక దళ సిబ్బంది శిక్షణ తీసుకుంటుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

తమ దేశానికి చెందిన రెండు యూరో యుద్ధ విమానాలు ఢీ కొన్నాయని జర్మనీ పశ్చిమ పొమెరానియా రాష్ట్ర అంతర్గత వ్యవహారాల మంత్రి మెక్లెన్‌బర్గ్ నిర్ధారించారు. లేక్‌ మ్యూరిట్జ్‌కి సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. విమానాలు ఢీ కొన్న తర్వాత పెద్ద ఎత్తున పొగలు కక్కుతూ రెండూ కూలిపోయాయి. ‌అయితే, ఈ విషయంపై జర్మనీ వైమానిక దళం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదీ చూడండి: 1300 అడుగుల ఎత్తులో అన్నాచెల్లెళ్ల రోప్​వాక్​

ABOUT THE AUTHOR

...view details