తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రకృతికి హాని చేయని ప్లాస్టిక్​ వస్తుందోచ్!

రోజూ మనం వాడి పడేసే ప్లాస్టిక్​ ఉత్పత్తుల కారణంగా పర్యావరణంలో కాలుష్యంతో పాటు, కొన్ని జీవరాసులకు ప్రాణహాని కలుగుతోంది. వాటికి ప్రత్యమ్నాయంగా ఓ పరిశోధన బృందం బయో ప్లాస్టిక్​ తీసుకొస్తోంది.

By

Published : Jul 8, 2019, 6:52 PM IST

ప్రకృతికి పట్టిన ప్లాస్టిక్​ భూతం వీడేందకు మార్గం

ప్రకృతికి పట్టిన ప్లాస్టిక్​ భూతం వీడేందకు మార్గం

ఐరాస అమెరికా పర్యావరణ విభాగం 2018 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 300 మిలియన్​ టన్నుల వ్యర్థ పదార్థాలు, చెత్త పేరుకుపోతుండగా అందులో 9 శాతం మాత్రమే పునర్వినియోగం జరుగుతోంది.

ప్లాస్టిక్​ సీసాల​ కారణంగా సంవత్సరంలో 13 మిలియన్​ టన్నుల ప్లాస్టిక్​ పోగవుతోందని ఆ సంస్థ తెలిపింది. ఇలాగే పరిస్థితులు కొనసాగితే 2050 నాటికి సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్​ ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రతి సంవత్సరం ప్లాస్టిక్​ వ్యర్థాల కారణంగా లక్షకు పైగా సముద్ర జీవరాసులు మృత్యువాత పడుతున్నాయి.

ఇందుకు ప్రత్యమ్నాయంగా ఇటలీకి చెందిననోవామోంట్ వ్యాపార సంస్ధ మార్కెట్​ లోకి బయో ప్లాస్టిక్​ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. 2008 సంవత్సరంలో బయోప్రాడక్ట్​ 'మాటర్-బై'ని జర్మనీలోని హైడ్రా మెరైన్​ సైన్స్ జిఎమ్​బిహేచ్ సంస్థ పరీక్షించింది. ఈ రకం ప్లాస్టిక్​ని పాకేజింగ్​, డిస్​పోజల్​ టేబుల్​వేర్​, వ్యవసాయం, అలంకరణ సామగ్రి, ఫార్మాస్యూటికల్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఈ ఉత్పత్తులు భూమిలో, నీటిలోనూ కుళ్లిపోయే విధంగా రూపొందించారు.

"ఇందులో మూడంచెల పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షించిన పదార్థాలు సహజ సముద్ర వాతావరణంలో కూడా క్షీణిస్తాయి. ఈ ప్రక్రియకు సమయం తీసుకుంటుంది. ప్లాస్టిక్​ ఏ దశల్లో మగ్గుతుందన్న విషయం మీద ఇది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అవి ప్రయోగశాలలో విచ్ఛిన్నం చెందితే ప్రకృతిలోనూ విచ్ఛిన్నమవుతాయి."

-లోట్​,పరిశోధకుడు

మనిషి జీవన మనుగడలో వస్తున్న మార్పుల కారణంగా ముప్పు ఎదుర్కొంటున్న పర్యావరణాన్ని రక్షించాలంటే ఇలాంటి నూతన సాంకేతిక మార్పు తప్పనిసరి.

ABOUT THE AUTHOR

...view details