తెలంగాణ

telangana

' మిడతలు ఆహార భద్రతకు పెను ముప్పుగా మారాయి'

By

Published : Jul 21, 2020, 11:07 AM IST

భారత్​తో పాటు ఆఫ్రికా, పాకిస్థాన్​ దేశాల్లో మిడతల దాడులు ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా మారినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. మానవ తప్పిదాల వల్ల వాతావరణంలో మార్పులు జరిగి మిడతల ప్రత్యుత్పత్తికి దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడింది.

locust attacks posing serious threat to food security in parts of east africa india :wmo
'మిడదల దాడుల వల్ల ఆహార భద్రతకు పెను ముప్పు'

మిడతల దాడులు భారత్‌ సహా తూర్పు ఆఫ్రికా, పాకిస్థాన్ దేశాల్లో ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎం​ఓ హెచ్చరించింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల ఫలితంగానే మిడతల దాడులు ఎక్కువయ్యాయన్న డబ్ల్యూఎం​ఓ ... దీనికి మానవ కార్యకలాపాలే ప్రధాన కారణమని పేర్కొంది. వాతావరణ మార్పులు, ఎడారి ప్రాంతాల్లో ఉష్ణొగ్రత, వర్షపాతం పెరుగుదల, ఉష్ణమండల తుపానులు, మిడతల ప్రత్యుత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయని తెలిపింది. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లోని పంటలపై మిడతలు దాడి చేసి అపార నష్టం కలిగించాయి. తూర్పు ఆఫ్రికా దేశాల్లోనూ ఈ ఎడారి పురుగులు పెద్దఎత్తున పంట నష్టం కలిగించినట్లు డబ్ల్యూఎం​ఓ వివరించింది.

ఇతర దేశాల్లోనూ....

ఇథియోపియాలో... డిసెంబర్ 2019 నుంచి మార్చి 2020 మధ్య లక్షా 14 వేల హెక్టార్ల పంట నష్టం సంభవించినట్లు వాతావరణ సంస్థ అంచనా వేసింది. కెన్యా, ఉగాండా, దక్షిణ సుడాన్‌ దేశాల్లోనూ మిడతలు ఇదే స్థాయిలో పచ్చదనాన్ని ధ్వంసం చేస్తున్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది.

ఇదీ చూడండి:దేశంలో 28 వేలు దాటిన కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details