తెలంగాణ

telangana

By

Published : Oct 16, 2019, 9:47 AM IST

Updated : Oct 16, 2019, 1:40 PM IST

ETV Bharat / international

'బ్రెగ్జిట్​' సందిగ్ధతకు రెండు రోజుల్లో తెర!

గత మూడేళ్లుగా బ్రెగ్జిట్ ఒప్పందంపై నెలకొన్న సందిగ్ధత మరికొన్ని గంటల్లో తొలగిపోతుందని ఐరాపా సమాఖ్య అధికారులు తెలిపారు. గురువారంలోగా ఈ ఒప్పందంపై స్పష్టత వస్తుందన్నారు.

'బ్రెగ్జిట్​' సందిగ్ధతకు రెండు రోజుల్లో తెర!

'బ్రెగ్జిట్​' సందిగ్ధతకు రెండు రోజుల్లో తెర!

మూడేళ్లుగా బ్రిటన్ దేశాన్ని​ ముప్పుతిప్పలు పెడుతున్న బ్రెగ్జిట్​ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు కనపడుతోంది. గురువారం జరగనున్న ఐరోపా సమాఖ్య సమావేశంలో ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ఈయూ వర్గాలు తెలిపాయి.

బ్రెగ్జిట్ ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​తో ఈయూ అధికారులు తరచూ సంప్రందింపులు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రమూ ఆయనతో సమావేశమయ్యారు. ఒప్పందంలో పలు కీలక విషయాలపై చర్చించారు. అయితే ఒప్పందం కుదుర్చుకోవాలంటే బ్రిటన్​ అనేక విషయాల్లో రాజీపడాల్సిన పరిస్థితి నెలకొంది.

అక్టోబరు 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాలి. ఈ తేదీకి ముందు ఈయూ.. గురువారం నిర్వహించే సమావేశమే చివరిది.
బ్రెగ్జిట్ ఒప్పందంపై సానుకుల ప్రభావంతో బ్రిటన్ పౌండ్ విలువ గత కొద్ది రోజులుగా వృద్ధి చెందుతోంది.

మూడేళ్లుగా తొలగని సందిగ్ధత

మూడేళ్లుగా బ్రెగ్జిట్​కు సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తి కావడం లేదు. ప్రతిపక్ష ఎంపీలు, అధికార పార్టీలోని కొందరు నేతలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్రిటన్​ పార్లమెంటులో అనేకమార్లు ప్రవేశ పెట్టిన బ్రెగ్జిట్ బిల్లులు వీగిపోయాయి. చివరికి మాజీ ప్రధాని థెరిసా మే తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్ జాన్సన్​.. ఎట్టిపరిస్థితిల్లోనైనా బ్రెగ్జిట్ ఒప్పందం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'ఆర్టెమిస్​'​: నాసా కొత్త తరం స్పేస్​సూట్ల ఆవిష్కరణ

Last Updated : Oct 16, 2019, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details