తెలంగాణ

telangana

ETV Bharat / international

యెమెన్​లో భారీ పేలుడు.. 13 మంది మృతి

అరబ్​ దేశం యెమెన్​లో ఓ గిడ్డింగిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. 110 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది సౌదీ అరేబియానేనని హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు.

By

Published : Apr 8, 2019, 9:54 AM IST

Updated : Apr 8, 2019, 10:57 AM IST

యెమెన్​లో భారీ పేలుడు.. 13 మంది మృతి

యెమెన్​లో భారీ పేలుడు.. 13 మంది మృతి

యెమెన్​లో హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని రాజధాని సనాలో.. ఓ ఆయుధ గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్న పిల్లలతో సహా 13 మంది మరణించారు. మరో 110 మందికిపైగా గాయపడ్డారని వైద్యాధికారులు తెలిపారు.

సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలే ఈ గిడ్డంగిపై వైమానిక దాడిచేసాయని హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. ఈ గిడ్డంగిలో హౌతీలు ఆయుధాలు నిల్వచేశారని ఆడెన్​లోని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ తెలిపింది. అయితే... ఈ దాడితో తమకు సంబంధం లేదని సౌదీ సంకీర్ణం స్పష్టం చేసింది.

ఇరాన్​ సహకారం ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు 2014 నుంచి యెమెన్​ రాజధాని సనాను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. వీరితో 2015 నుంచి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు పోరాడుతూనే ఉన్నాయి. పరస్పర దాడుల్లో వేలాది మంది ప్రజలు బలయ్యారు. నిరంతర అశాంతి వల్ల యెమెన్ అరబ్​ ప్రాంతంలోని అత్యంత పేద దేశంగా మారి క్షామంతో అల్లాడుతోంది.

Last Updated : Apr 8, 2019, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details