తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం: ఖురేషీ

కశ్మీర్​ సమస్యపై భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహ్మద్​ ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్​ విషయంలో భారత్​తో యుద్ధానికి సిద్ధమని పాక్​ ప్రధాని ప్రకటించిన మరుసటి రోజే... ఆ దేశ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

By

Published : Aug 31, 2019, 7:17 PM IST

Updated : Sep 29, 2019, 12:02 AM IST

భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దం: ఖురేషీ

భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దం: ఖురేషీ

కశ్మీర్​ అంశంపై భారత్​తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాక్​ విదేశాంగ మంత్రి షా మహ్మద్​ ఖురేషీ తెలిపారు. కశ్మీర్​ విషయంలో భారత్​తో యుద్దానికి సిద్ధంగా ఉన్నామని పాక్​ ప్రధాని ప్రకటించిన మరుసటి రోజే ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్​తో ద్వైపాక్షిక చర్చలను పాకిస్థాన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. కశ్మీర్​ విషయంలో అమెరికా లాంటి దేశాల జోక్యాన్ని కోరుకుంటున్న పాక్​... ఇప్పటికే పరిష్కార దిశగా ముమ్మర ప్రయత్నాలు చేసింది. భారత్​ ఆ ప్రయత్నాలన్నీ వమ్ము చేసింది. కశ్మీర్​ తమ అంతర్గత సమస్య అని.. ఈ అంశంలో ఇతర దేశాలేవీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్​నకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తేల్చి చెప్పారు.

కశ్మీర్​ సమస్య పరిష్కారానికి ఇతర దేశాల జోక్యం ఉంటే బాగుంటుందని ఖురేషీ అభిప్రాయపడ్డారు. జమ్ముకశ్మీర్​లో​ గృహనిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను విడుదల చేసిన తర్వాతే భారత్​తో చర్చలు జరిపే అవకాశం ఉంటుందన్నారు.

పూటకో మాట మారుస్తున్న పాక్

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత భారత్, పాక్​ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్​తో ఎలాంటి చర్చలకు తావులేదని ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వెంటనే పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రకటించారు. ఆ వెంటనే పాక్​ రైల్వే శాఖ మంత్రి సెప్టెంబర్​లో కానీ, అక్టోబర్​లో కానీ అణుయుద్ధం జరగబోతుందని అన్నారు. ఇప్పుడు పాక్​ విదేశాంగ మంత్రి మహ్మద్​ ఖురేషీ మాత్రం భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దమంటూ వాఖ్యానించడం గమనార్హం.

ఇదీ చూడండి:హై అలర్ట్​: భారత్​పై దాడులకు పాక్​ కుట్ర..!

Last Updated : Sep 29, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details