తెలంగాణ

telangana

ETV Bharat / international

'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'

శ్రీలంక చర్చ్​లు, హోటళ్లపై జరిగిన వరుస బాంబుదాడులుకు ప్రతీకారమే కారణమని ఆ దేశ రక్షణమంత్రి రువాన్ విజెవర్ధనే స్పష్టం చేశారు. కొన్ని వారాల క్రితం న్యూజిలాండ్​లోని మసీదులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే స్థానిక ఇస్లామిక్​ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన పార్లమెంట్​లో వెల్లడించారు.

By

Published : Apr 23, 2019, 4:14 PM IST

Updated : Apr 23, 2019, 5:04 PM IST

'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'

'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'

శ్రీలంకలో ఆదివారం చర్చిలు, హోటళ్లపై జరిగినవి ప్రతీకార ఉగ్రదాడులని ఆ దేశ రక్షణమంత్రి రువాన్​ విజెవర్ధనే పార్లమెంట్​కు తెలిపారు. కొద్ది వారాల క్రితం న్యూజిలాండ్​లోని మసీదులపై జరిగిన దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలోని స్థానిక ఇస్లామిక్​ ఉగ్రవాదులు చర్చ్​లపై బాంబు దాడులకు పాల్పడ్డారని ఆయన స్పష్టం చేశారు.

ఉగ్రదాడి అనంతరం తాజా పరిస్థితులపై చర్చించేందుకు శ్రీలంక పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి పూర్వాపరాలను పార్లమెంటుకు రక్షణమంత్రి వివరించారు. వరుస బాంబుదాడుల్లో ఇప్పటి వరకు 321 మంది మరణించారని, మరో 500 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. 375 మంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు.

ప్రతీకారమే కారణం..

కొద్ది వారాల క్రితం న్యూజిలాండ్​లోని మసీదులపై ఆస్ట్రేలియాకు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యకు ప్రతీకారంగానే శ్రీలంకలోని స్థానిక నేషనల్​ తౌవీక్​ జమాత్​ ఉగ్రవాదులు చర్చిలను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: లంక దాడి: 10కి భారతీయ మృతుల సంఖ్య

Last Updated : Apr 23, 2019, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details