తెలంగాణ

telangana

ETV Bharat / international

భూటాన్​ రుచులతో మోదీకి పసందైన విందు!

ప్రధాని నరేంద్రమోదీ భూటాన్​లో రెండో రోజు పర్యటించనున్నారు. రాజదంపతులు ఇచ్చే విందు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు భారత్​కు తిరుగు పయనమవుతారు.

By

Published : Aug 18, 2019, 7:19 AM IST

Updated : Sep 27, 2019, 8:52 AM IST

భూటాన్​లో ప్రధాని మోదీ రెండోరోజు షెడ్యూల్​

రెండు రోజుల భూటాన్​ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు థింపూలోని రాయల్​ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 10.30 గంటలకు జాతీయ స్మారక స్తూపాన్ని సందర్శిస్తారు.

ఉదయం 11 గంటలకు భూటాన్​లోని ప్రధాన ప్రతిపక్షనేత పెమా గెమత్సోతో సమావేశమవుతారు మోదీ. 12 గంటలకు రాజదంపతులు ఇచ్చే విందులో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీకి విమానంలో బయలుదేరతారు.

నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించిన తరువాత చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. మొదటి దఫా అధికారంలో వచ్చినపుడూ... మోదీ భూటాన్​లోనే తొలిసారి పర్యటించారు.​

ఇదీ చూడండి: లిత్వేనియా అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి భేటీ

Last Updated : Sep 27, 2019, 8:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details