తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ నుంచి పోలియో మార్కర్ల దిగుమతికి పాక్​ నిర్ణయం!

జమ్ముకశ్మీర్​ విభజన, అధికరణ 370 రద్దు అనంతరం భారత్​తో వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాకిస్థాన్​ కొన్ని నెలల్లోనే వెనక్కి తగ్గింది. భారత్​ నుంచి పోలియో మార్కర్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. మార్కర్ల దిగుమతికి వన్​-టైమ్​ అనుమతి ఇవ్వాలని ఆ దేశ ఫెడరల్​ కేబినేట్​ నిర్ణయించింది.

By

Published : Dec 26, 2019, 4:08 AM IST

Updated : Dec 26, 2019, 7:37 AM IST

Pakistan to import polio markers from India
భారత్​ నుంచి పోలీయో మార్కర్ల దిగుమతికి పాక్​ నిర్ణయం!

భారత్​ నుంచి పోలియో మార్కర్ల దిగుమతికి పాక్​ నిర్ణయం!

భారత్​ నుంచి పోలియో మార్కర్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది పాకిస్థాన్​. ఈ మేరకు ఆ దేశ ఫెడరల్​ కేబినేట్​ వన్​-టైమ్​ అనుమతులు ఇచ్చినట్లు పాక్​కు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది. జమ్ముకశ్మీర్​ విభజన, అధికరణ 370 రద్దు చేసిన కొన్ని నెలల్లోనే పాకిస్థాన్​ తన మొండి వైఖరి నుంచి వెనక్కి తగ్గింది. అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాక్..​ ఔషధాల దిగుమతిలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

" భారత్​ నుంచి పోలియో మార్కర్ల దిగుమతికి వన్​-టైమ్​ అనుమతి ఇవ్వాలని ఫెడరల్​ కేబినేట్​ నిర్ణయం తీసుకుంది. భారత్​ నుంచి మందుల దిగుమతిపై నిషేధం ఎత్తివేయాలని ఆ దేశ ఔషధ పరిశ్రమ డిమాండ్​ చేస్తోంది. లేకపోతే కొన్ని వారాలలో పాకిస్థాన్​ తీవ్ర మందుల కొరత, ముఖ్యంగా ప్రాణాలను రక్షించే ఔషధాల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించింది. దాని పర్యవసానంగా భారత్​ నుంచి మందులు, ముడి పదార్థాల దిగుమతిపై నిషేధాన్ని గత సెప్టెంబర్​లో ఎత్తివేసింది పాక్​."
- పాక్ మీడియా సంస్థ

మార్కర్లు ఎందుకు?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదిత పోలియో వాక్సిన్​ను చిన్నారులకు అందించిన అనంతరం వారి వేలికి మార్కర్లతో గుర్తు పెడతారు. పోలియో చుక్కలు వేసే క్రమంలో పిల్లలు కొంత మేర ఇంకును మింగే అవకాశం ఉన్నందున విషపూరితం కాని మార్కర్ల దిగుమతి అవసరమని పాకిస్థాన్​ పోలియో అత్యవసర సేవల కేంద్రం జాతీయ కోఆర్డినేటర్​ డాక్టర్​ రాణా సఫ్దార్ తెలిపారు.

భారత్​, చైనాలోనే..

చిన్నారులు ఇంకును మింగినా.. విషపూరితంకాని మార్కర్లు తయారీ చేసే డబ్ల్యూహెచ్​ఓ ఆమోదిత సంస్థలు భారత్​, చైనాలో మాత్రమే ఉన్నాయి. పాక్​ కోసం డబ్ల్యూహెచ్​ఓ మార్కర్లను సేకరిస్తోంది. గతంలో చైనా నుంచి కొనుగోలు చేసినప్పటికీ.. నాణ్యత విషయంలో తేడా వచ్చి భారత్​ నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. వాణిజ్యంపై పాక్​ నిషేధం విధించక ముందే భారత్​ నుంచి 8 లక్షల మార్కర్లు సేకరించాలని డబ్ల్యూహెచ్​ఓ నిర్ణయించింది. కానీ.. నిషేధం వల్ల పంపిణీ కాలేదు. ప్రస్తుతం నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నందున పాక్​కు మార్కర్లు చేరనున్నాయి.

104 కేసుల గుర్తింపు..

పాకిస్థాన్​ సహా అఫ్గానిస్థాన్​, నైజీరియాలో పోలియో లక్షణాలు ఇంకా ఉన్నాయి. ఈ ఏడాది పాకిస్థాన్​లో 104 పోలియో కేసులు నమోదయ్యాయి. దేశంలోని 33 జిల్లాల్లో సుమారు 6.75 మిలియన్లకు పైగా చిన్నారులకు పోలియో వాక్సిన్​ పంపిణీ ఈనెలలోనే ప్రారంభించింది పాక్​. 1994 నుంచి పోలియోను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టింది​.

ఇదీ చూడండి: మరోసారి పాక్​ దుర్నీతి.. భారత సైన్యాధికారి వీరమరణం

Last Updated : Dec 26, 2019, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details