తెలంగాణ

telangana

ETV Bharat / international

వాయుమార్గం ఆంక్షలు ఎత్తివేస్తాం: పాక్​

బాలాకోట్​లో వైమానిక దాడుల అనంతరం వాయుమార్గంపై తాత్కాలికంగా విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని పాకిస్థాన్​ ప్రకటించింది. పాక్​పై విధించిన వాయుమార్గం ఆంక్షలను ఎత్తివేస్తున్నామని  ట్విట్టర్​ వేదికగా శుక్రవారం ప్రకటించింది భారత వాయుసేన. దీనికి బదులుగా పాక్​ కూడా ఆంక్షలు ఎత్తివేసేందుకు సిద్ధమైంది.

By

Published : Jun 2, 2019, 7:57 AM IST

Updated : Jun 2, 2019, 9:20 AM IST

వాయుమార్గం ఆంక్షలు ఎత్తివేస్తాం: పాక్​

వాయుమార్గం ఆంక్షలు ఎత్తివేస్తాం: పాక్

ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్​ వైమానిక దాడుల ఘటన అనంతరం భారత్​పై విధించిన తాత్కాలిక వాయుమార్గ ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రకటించింది పొరుగు దేశం పాకిస్థాన్.

బాలాకోట్ ఘటన అనంతరం భారత గగనతలంలో పాక్​పై విధించిన ఆంక్షలను వాయుసేన ఎత్తివేసింది. భారత గగన తలంలోని అన్ని వాయు మార్గాలపై 2019 ఫిబ్రవరి 27న విధించిన తాత్కాలిక ఆంక్షలను తొలగించినట్లు అధికారిక ట్విటర్ ఖాతాలో శుక్రవారం వెల్లడించింది ఐఏఎఫ్.

భారత్ నిర్ణయానికి ప్రతిస్పందించింది పాక్.​ తమ గగనతలంలోకి భారత విమానాల ప్రవేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రకటించింది. భారత వైమానిక దళం ట్విట్టర్​ ద్వారా ప్రకటన విడుదల చేసిందని, తమకు అధికారిక సమాచారం అందలేదని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్​ అధికారి చెప్పారు. మీడియాలో మాత్రమే వార్తలు చూశామన్నారు. భారత్​ వాయుమార్గం ఆంక్షలు ఎత్తివేస్తే పాక్​ కూడా అందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని జైషే ఉగ్ర స్థావరాల మీద భారత్‌కు చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆ మరసటి రోజు పాక్ వైమానిక దళం ఎఫ్​-16 విమానాలతో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఈ నేఫథ్యంలో ఐఏఎఫ్ భారత గగన తలంలోని వాయు మార్గాల మీద తాత్కాలిక ఆంక్షలు విధించింది.

ఇరు దేశాల అంక్షలతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. దిల్లీ నుంచి యూరప్​, అమెరికా వెళ్లే విమాన సేవలపై ప్రభావం పడింది. దిల్లీ నుంచి పాక్​ మీదుగా కాబూల్​ వెళ్లే సర్వీసులను ఎయిర్ ఇండియా, స్పైస్​ జెట్​ నిలిపివేశాయి.

ఇదీ చూడండి: వాణిజ్య యుద్ధం: అమెరికాపై చైనా​ ప్రతీకారం

Last Updated : Jun 2, 2019, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details