తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​ వరదలు: 28కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్​లో భారీ వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్య 28కి చేరింది. వరదల్లో గల్లంతయిన 16 మంది ఆచూకీ ఇంకా లభించలేదు.  రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

By

Published : Jul 13, 2019, 4:28 PM IST

నేపాల్​ వరదలు: 28కి చేరిన మృతుల సంఖ్య

కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు నేపాల్​లో జనజీవనం అస్తవ్యస్తమయింది. వరదల కారణంగా దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 28కి చేరింది. వరదల్లో గల్లంతయిన 16 మంది ఆచూకీ ఇంకా లభించలేదు.

లలిత్​పుర్​, కావ్​రే, కొటాంగ్​, భోజ్​పురి, మకాన్​పురిలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై... చెరువులను తలపిస్తున్నాయి.

సహాయ చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న సుమారు 50 మందిని రక్షించారు. వరదల కారణంగా 6 వేల మంది వరకు నిరాశ్రయులయినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: నేపాల్​లో​ భారీ వర్షాలు- 17 మంది బలి

ABOUT THE AUTHOR

...view details