తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ-20 సదస్సు: సభ్య దేశాలతో మోదీ భేటీ

జీ-20 సభ్యదేశాలు ఇండోనేసియా, బ్రెజిల్​, టర్కీ అధినేతలతో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతంపై ప్రధానంగా చర్చించారు.

By

Published : Jun 29, 2019, 10:11 AM IST

సభ్య దేశాలతో మోదీ భేటీ

ఇండోనేసియా, బ్రెజిల్​, టర్కీ దేశాధ్యక్షులతో ప్రధాని నరేంద్రమోదీ వేర్వేరుగా సమావేశం అయ్యారు. జీ-20 సదస్సులో భాగంగా ప్రత్యేకంగా జరిగిన ఈ భేటీల్లో దేశాల మధ్య పరస్పర వాణిజ్య సంబంధాలపై చర్చించారు.

ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో భేటీలో వివిధ అంశాలను ప్రస్తావించారు మోదీ. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర రవాణా రంగాల్లో సంబంధాల బలోపేతం చేసే మార్గాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ భేటీ తర్వాత బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్​ బోల్సోనారోతో సమావేశం అయ్యారు మోదీ. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయం, జీవ ఇంధనాలపై సమాలోచనలు జరిపారు.

అనంతరం టర్కీ అధ్యక్షుడు రిసెప్​ తయీప్​ ఎర్డోగాన్​తో భేటీ అయ్యారు.

మహిళా సాధికారతకు మద్దతు

మహిళా సాధికారతకు మద్దతుగా నిలుస్తామని జీ-20 దేశాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ సలహాదారు ఇవాంకా ట్రంప్​ ప్రతిపాదనను అన్ని దేశాలు అంగీకరించాయి.

"మహిళలకు సమాన హక్కులు కల్పిస్తే 2025కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో 28 ట్రిలియన్​ డాలర్ల మేర పెరుగుతుంది."

-ఇవాంకా ట్రంప్​, ట్రంప్​ సలహాదారు

ఇదీ చూడండి: జీ20 సదస్సు: అందరి కళ్లు పుతిన్​ 'మగ్​'పైనే

ABOUT THE AUTHOR

...view details