తెలంగాణ

telangana

ETV Bharat / international

'శ్రీలంక బాంబర్లకు కశ్మీర్, కేరళ​లో శిక్షణ!'

శ్రీలంకలో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులు భారత్​ను సందర్శించారని కొలంబొ అధికారులు వెల్లడించారు. అక్కడకు వారు శిక్షణ కోసంగానీ, ఇతర అంతర్జాతీయ ఉగ్రసంస్థలతో సంబంధాలు పెంచుకోవడానికి గానీ వెళ్లినట్లు తెలిసిందని చెప్పారు.

By

Published : May 4, 2019, 5:08 PM IST

Updated : May 4, 2019, 8:00 PM IST

'లంక ఆత్మాహుతి బాంబర్లకు కశ్మీర్​లో శిక్షణ'

'శ్రీలంక బాంబర్లకు కశ్మీర్, కేరళ​లో శిక్షణ!'

శ్రీలంకలో ఆత్మాహుతి దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు భారత్​లోని కశ్మీర్, కేరళలో శిక్షణ కోసం వచ్చి వెళ్లినట్లు ఆ దేశ లెఫ్టినెంట్ జనరల్​ మహేశ్​ నాయకే నిర్ధరించారు. ఇతర అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెంచుకునేందుకూ అయ్యుండవచ్చని ఆయన అన్నారు.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూలో లెఫ్టినెంట్​ జనరల్ మహేశ్​ సేనా నాయకే ఈ విషయాలను వెల్లడించారు. ఆత్మాహుతి బాంబర్లు భారత్​ సందర్శించారని ఒక సీనియర్ సైనిక అధికారి నిర్ధరించడం ఇదే తొలిసారి.

"ఆత్మాహుతి బాంబార్లు భారత్​ వెళ్లారు. అక్కడ కేరళ, బెంగళూరు, కశ్మీర్​ల్లో పర్యటించారు. ఈ సమాచారం మా వద్ద ఉంది. వారు శిక్షణ కోసం వెళ్లారు. ఇతర దేశాల ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెంచుకోవడానికీ వెళ్లి ఉండొచ్చు." -మహేశ్​ సేనా నాయకే, లెఫ్టినెంట్​ జనరల్​

నిఘా సమాచారం ఉన్నా దాడులను అడ్డుకోలేక పోవడానికి ప్రభుత్వమూ, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని సేనానాయకే అభిప్రాయపడ్డారు.

ఇదీ జరిగింది..

ఏప్రిల్​ 21న ఈస్టర్ ఆదివారం నాడు శ్రీలంకలోని మూడు చర్చిలు, లగ్జరీ హోటళ్లలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒక మహిళ సహా తొమ్మిది మంది ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారు. ఈ నరమేధంలో 253 మంది మరణించగా, 500 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఈ దాడికి పాల్పడింది స్థానిక 'నేషనల్​ తౌవీద్​ జమాత్' (ఎన్​టీజే)​ ఉగ్రవాదులని శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇప్పటికే వంద మంది అనుమానితులను అరెస్టు చేసింది. అయితే ఆ సంస్థ ఈ దాడులకు బాధ్యత వహించలేదు. మరో వైపు ఇస్లామిక్​ స్టేట్​ (ఐసిస్​) ఈ ఉగ్రదాడులకు తామే కారణమని ప్రకటించింది.

ఇదీ చూడండి: వజీరలోంగ్​కోర్న్​ అను నేను థాయ్​ మహారాజుగా...

Last Updated : May 4, 2019, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details