తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2020, 9:57 AM IST

ETV Bharat / international

చైనాలో ఒక్కసారిగా 1,290 పెరిగిన కరోనా మరణాలు

కరోనా కేసులు, మృతుల సంఖ్యలో చైనా వైఖరిపై ఆది నుంచి ప్రపంచదేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ తాజాగా చైనా కళ్లు తిరిగే గణాంకాలు వెల్లడించింది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్​ నగరంలో మృతుల సంఖ్య 1,290 పెరిగినట్లు ప్రకటించింది.

WUHAN
తప్పయిపోయింది.. వుహాన్​ మృతుల సంఖ్య ఇది: చైనా

"ఏదో జరుగుతోంది... అయినా కరోనాకు పుట్టినిల్లు అయిన వుహాన్​లో ఇంత తక్కువ మరణాలా?".... ఇది చైనా గణాంకాలు విన్న ప్రతి ఒక్కరు చెప్పిన మాట. ఇప్పుడు ఈ అనుమానమే నిజమైంది. వుహాన్​ నగరం మృతుల సంఖ్యను ఒక్కసారే 50 శాతం పెంచింది చైనా. అంటే కొత్తగా 1,290 మరణాలను లెక్కల్లో చేర్చింది.

ఇంతకుముందు వుహాన్​లో మృతుల సంఖ్య 2,579గా ఉంది. ప్రస్తుతం కొత్త గణాంకాలను కలుపుకుంటే వుహాన్​లో మొత్తం మృతుల సంఖ్య 3,869కి పెరిగింది.

అయితే తప్పుగా గణించడం వల్లే వీటిని గుర్తించలేకపోయామని చైనా చెప్పుకొచ్చింది.

ABOUT THE AUTHOR

...view details