తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​లో భారీ పేలుడు... తాలిబన్ల కుట్రే..!

అమెరికాలో విధ్వంసం సృష్టించిన 9/11 దాడులు జరిగి సరిగ్గా 18 ఏళ్లు గడుస్తున్న వేళ... అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​లో బీభత్సం జరిగింది. అక్కడి అమెరికా దౌత్యకార్యాలయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.

By

Published : Sep 11, 2019, 7:32 AM IST

Updated : Sep 30, 2019, 4:50 AM IST

అఫ్గాన్​లో భారీ పేలుడు... తాలిబన్ల కుట్రే..!

అఫ్గానిస్థాన్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్​లోని అమెరికా దౌత్యకార్యాలయం సమీపంలో భారీ పేలుడుకు పాల్పడ్డారు. అఫ్గాన్​లోని తాలిబన్లతో చర్చలు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఈ ఘటన జరిగింది.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. దాడులపై ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు. అయితే.. తాలిబన్లేనని అనుమానిస్తున్నాయి నిఘా వర్గాలు.

అగ్రరాజ్యం అమెరికాను వణికించిన 9/11 దాడులు జరిగి సరిగ్గా 18 ఏళ్లు గడుస్తున్న వేళ ఈ పేలుడు జరగడం గమనార్హం.

Last Updated : Sep 30, 2019, 4:50 AM IST

ABOUT THE AUTHOR

...view details