తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2020, 5:30 AM IST

Updated : Feb 29, 2020, 5:15 PM IST

ETV Bharat / international

సైకోలా మారిన సైనికుడు- 20 మంది బలి

థాయి​లాండ్​లో జవాను జరిపిన కాల్పుల ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని టెర్మినల్​ 21 షాపింగ్​ మాల్​లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడా దుండగుడు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూవివాదంతో విసుగు చెందిన ఆ జవాను.. ఈ చర్యకు ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

A Thailand soldier has killed at least 20 people in a shooting spree
సైకోలా మారిన సైనికుడు-20 మంది బలి

సైకోలా మారిన సైనికుడు- 20 మంది బలి

థాయి​లాండ్​లో ఓ సైనికుడు సైకోలా మారాడు. మిలటరీ క్యాంప్​, షాపింగ్​ మాల్​లో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు థాయి​లాండ్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

ఏం జరిగిందంటే?

సైన్యంలో జూనియర్ అధికారిగా పనిచేస్తున్న సార్జెంట్​ మేజర్​ జక్రపంత్ థోమా.. శనివారం సాయంత్రం నఖోన్​ రాచసిమాలోని ఆర్మీ బ్యారెక్స్​కు వచ్చాడు. అక్కడే ఉన్న సీనియర్​ కమాండింగ్ అధికారిపై కాల్పులు జరిపాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తర్వాత బ్యారెక్స్​ నుంచి ఆయుధాలు, ఓ వాహనాన్ని తస్కరించి నగరం నడిబొడ్డున ఉన్న టెర్మినల్ 21 షాపింగ్​ సెంటర్​లో ప్రవేశించాడు. వచ్చిన వెంటనే అక్కడున్న వారిపై కాల్పులు మొదలుపెట్టాడు. దీంతో జనం బెంబేలెత్తి అక్కడి నుంచి హాహాకారాలు చేస్తు బయటకు పరుగులు తీశారు. ఇక్కడ 17 మంది మరణించారు. తర్వాత దుండగుడు తన ఫేస్​బుక్​ ఖాతాలో దాడికి సంబంధించి పోస్టులు పెట్టాడు.

భూ వివాదమే కారణమా!

అయితే దుండగుడు ఇంకా షాపింగ్​ మాల్​లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. సాయుధుడు మాల్​లోనే ఎక్కడో తల దాచుకున్నట్లు సమాచారం. భవనంలో ఇంకా ఎంతమంది ప్రజలు ఉన్న విషయంపైనా స్పష్టత లేదు. దాడికి ఎందుకు పాల్పడ్డాడో తెలియలేదు. అయితే భూ వివాదం కారణంగానే కోపోద్రిక్తుడైన జవాను కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల భయంతో షాపింగ్​ మాల్​లో తలదాచుకున్న ప్రజలందరినీ పోలీసులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.

ప్రపంచంలో తుపాకీల వ్యాపారం జోరుగా సాగుతున్న దేశాల్లో థాయి​లాండ్ ఒకటి. ఇక్కడ కాల్పులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ సైనికాధికారి సామాన్యులను లక్ష్యంగా చేసుకుని భారీగా కాల్పులకు పాల్పడటం మాత్రం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి: సరిహద్దులో పాక్​ దుశ్చర్య.. భారత​ జవాన్​ మృతి

Last Updated : Feb 29, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details