తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉగ్రసంస్థలకు నిధులు రాకుండా అగ్రరాజ్యం అడ్డుకట్ట

ఉగ్రవాదాన్ని అణచివేయడానికి చర్యలు ముమ్మరం చేసింది అమెరికా. ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా ఉక్కుపాదం మోపింది. 2018 వరకు ఉగ్రసంస్థలకు చెందిన 46 మిలియన్ డాలర్ల నిధులు రాకుండా నిలిపేసినట్టు అమెరికా ఖజానా శాఖ వార్షిక నివేదిక తెలిపింది.

By

Published : May 30, 2019, 12:50 PM IST

Updated : May 30, 2019, 2:45 PM IST

ఉగ్రసంస్థలకు నిధులు రాకుండా అగ్రరాజ్యం అడ్డుకట్ట

ఉగ్రసంస్థల నిధులపై అమెరికా అడ్డుకట్ట

2018 వరకు ఉగ్రవాద సంస్థలు, ఉగ్ర సంబంధిత వ్యక్తులకు చెందిన 46 మిలియన్​ డాలర్ల నిధులను అమెరికా నిరోధించింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య ఖజానా శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో పాకిస్థాన్​ ఆధారిత ఉగ్రసంస్థలు కూడా ఉన్నాయి.

లష్కరే తోయిబాకు చెందిన 4 లక్షల డాలర్లు, జైషే మహ్మద్​కు చెందిన 1,725 డాలర్లపై అమెరికా అడ్డుకట్ట వేసినట్టు నివేదిక తెలిపింది.

ఉగ్రవాద సంస్థల ఆస్థులపై ఆంక్షలు విధించే అంశాన్ని ఖజానా శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం(ఓఎప్​ఏసీ) పర్యవేక్షిస్తోంది. జాతీయ భద్రత, అమెరికా విదేశీ విధానాల ఆధారంగా ఈ ఆంక్షలు ఉంటాయి.

నివేదిక ప్రకారం 2018 వరకు అగ్రరాజ్యం 46 మిలియన్​ డాలర్లను నిరోధించింది. 2017లో ఈ సంఖ్య 43.6 మిలియన్​ డాలర్లు.

అల్​ఖైదాకు చెందిన 6.4 మిలియన్​ డాలర్లు, ఎల్​టీటీఈకి సంబంధించిన 5 లక్షల డాలర్లను నిరోంధించినట్టు నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి: ఓ సామాన్యుడి అసామాన్య కథ.. 'మల్లేశం'

Last Updated : May 30, 2019, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details