తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇఫ్తార్​ విందులో ట్రంప్​ 'శాంతి మంత్రాలు'

శ్వేతసౌధంలో ఇఫ్తార్​ విందు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ట్రంప్​ పరిపాలనా విభాగంలోని ముస్లింలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. మత విద్వేషాలు, ఉగ్రవాదం అంతమవ్వాలని ఆకాంక్షించారు ట్రంప్​.

By

Published : May 14, 2019, 10:34 AM IST

శ్వేతసౌధంలో ఇఫ్తార్​ విందు

శ్వేతసౌధంలో ఇఫ్తార్​ విందు, ట్రంప్​ ప్రసంగం

పరిపాలనా విభాగంలోని ముస్లిం అధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలకు రంజాన్ మాసం​ సందర్భంగా శ్వేతసౌధంలో ఇఫ్తార్​ విందు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. రంజాన్​ మాసం దయ, దానం, సేవలు చేసే సమయమని చెప్పారు. కుటుంబాన్ని, సన్నిహితులను రంజాన్​ దగ్గర చేస్తుందని అభిప్రాయపడ్డారు ట్రంప్.

"శాంతి, సహనం, ఆకాంక్షలను కొనసాగించేందుకు ప్రజలు ఐక్యమయ్యే సమయమే రంజాన్​. అదే స్ఫూర్తితో అందరం కలిసి ఈ సమయంలో ఇఫ్తార్​​ కోసం కలిశాం. న్యూజిలాండ్​ మసీదుల్లో జరిగిన దాడుల్లో మృతి చెందిన ముస్లింల పట్ల అందరి హృదయాలు బాధతో నిండాయి. అలాగే శ్రీలంక, కాలిఫోర్నియా, పిట్స్​బర్గ్​లో జరిగిన దాడుల్లో క్రైస్తవులు, యూదులు చనిపోవడం విచారకరం."

-- డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఉగ్రవాదం, మత విద్వేషాలపై అందరూ పోరాడాలని, అవి ప్రపంచంలో సమూలంగా అంతమైపోవాలని ఆకాంక్షించారు. ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునే వాతావరణం రావాలని అన్నారు.

ఇదీ చూడండి : ఉద్యోగం మానేస్తే అమెజాన్​ బంపర్​ ఆఫర్​

ABOUT THE AUTHOR

...view details