తెలంగాణ

telangana

ETV Bharat / international

హ్యూస్టన్​కు చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ అమెరికాలోని హ్యూస్టన్​ నగరానికి చేరుకున్నారు. ఆదివారం హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 27వరకు అగ్రరాజ్యంలో మోదీ పర్యటన కొనసాగనుంది.

By

Published : Sep 21, 2019, 11:27 PM IST

Updated : Oct 1, 2019, 12:45 PM IST

హ్యూస్టన్​కు చేరుకున్న ప్రధాని మోదీ

హ్యూస్టన్​కు చేరుకున్న ప్రధాని మోదీ

ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం టెక్సాస్​లోని హ్యూస్టన్​ నగరానికి చేరుకున్నారు. అగ్రరాజ్య వాణిజ్య, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్​ క్రిస్టఫర్​ ఓల్సన్​ సహా పలువురు అధికారులు మోదీకి స్వాగతం పలికారు.

ఆదివారం హ్యూస్టన్​లో జరగనున్న 'హౌడీ మోదీ' కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకకు సుమారు 50వేల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించడం వల్ల ఈ 'హౌడీ మోదీ' హాట్​ టాపిక్​గా మారింది.

ఈ పర్యటనలో ట్రంప్​తో భేటీకానున్నారు మోదీ. వాణిజ్యం సహా అనేక అంశాలపై అగ్రనేతలు చర్చించనున్నారు. 27న ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసగించనున్నారు మోదీ.

ఇదీ చూడండి:-ప్రధాని మోదీ అమెరికా పర్యటన సాగనుంది ఇలా..

Last Updated : Oct 1, 2019, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details