తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 11:10 AM IST

ETV Bharat / international

ఐరాసలోని భారత బృందంతో ఐరోపా ఎంపీల భేటీ

ఐక్యరాజ్యసమితి(ఐరాస)లోని భారత శాశ్వత ప్రతినిధి బృందంతో... 17 మంది సభ్యుల యూరోపియన్ పార్లమెంట్ (ఎమ్​ఈపీ) బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సంస్కరణ, శాంతి పరిరక్షణ, మానవహక్కులు, నిరాయుధీకరణ, వాతావరణ సమస్యలు సహా పలు అంశాలపై భారత అధికారులతో చర్చించారు.

ఐరాసలోని భారత బృందంతో ఐరోపా ఎంపీల భేటీ

యూరోపియన్​ పార్లమెంట్ (ఎమ్​ఈపీ)​ ప్రతినిధి బృందం ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్​ను సందర్శించింది. ఐక్యరాజ్యసమితి సంస్కరణ, శాంతి పరిరక్షణ, మానవహక్కులు, నిరాయుధీకరణ, వాతావరణ సమస్యలు సహా పలు అంశాలపై భారత అధికారులతో చర్చించింది. ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్న ఈయూ-భారత్​లు పరస్పర సహకారంతో కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించాయి.

ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరుపక్షాలు గంటపాటు చర్చించాయి. ఎమ్​ఈపీ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషకరమని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. చట్టసభ్యులు అధికారిక ఈయూ ప్రతినిధులేనా అని ఓ నెటిజన్​ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఐరోపా పార్లమెంట్​లోని 5 వేర్వేరు బృందాలకు చెందిన.. 10 దేశాల నుంచి ఈ ఎమ్​ఈపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు' అని స్పష్టతనిచ్చారు.

ఐరాసలోని భారత్​ శాశ్వత మిషన్​తో జరిపిన చర్చల్లో ఐరోపా పార్లమెంట్​కు చెందిన రక్షణ, మానవహక్కులు, విదేశీ సంబంధాల కమిటీలు కూడా ఉన్నాయి.

కశ్మీర్​లో ఈయూ ఎంపీల బృందం పర్యటన

ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి బృందంతో.. ​ఈయూ పార్లమెంట్ సభ్యులు చర్చలు జరుపుతున్న సమయంలోనే.. జమ్ముకశ్మీర్​లో 23 మంది ఈయూ ఎంపీల బృందం పర్యటించింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్​లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఈ బృందం పరిశీలిస్తోంది.

లోయలో మానవహక్కులకు భంగం కలుగుతోందని పాకిస్థాన్​ చేస్తున్న ఆరోపణలకు చెక్​ పెట్టేందుకు భారత ప్రభుత్వం ఈయూ ఎంపీల బృందాన్ని కశ్మీర్​లో పర్యటించడానికి అనుమతినిచ్చింది.

ఇదీ చూడండి:నెగ్గిన బోరిస్​ ప్రతిపాదన.. డిసెంబర్​ 12నే బ్రిటన్​ ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details