తెలంగాణ

telangana

By

Published : May 27, 2021, 1:15 PM IST

ETV Bharat / international

భారత్​లో అమెరికా రాయబారిగా లాస్​ ఏంజెలెస్​​ మేయర్​!

త్వరలో భారత్​కు అమెరికా రాయబారిగా లాస్​ఏంజెలెస్​ మేయర్ ఎరిక్ గర్సెట్టీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(joe biden) నియమించనున్నట్లు తెలుస్తోంది. చైనా, జపాన్ దేశాలకు కూడా రాయబారులను బైడెన్(joe biden) ప్రకటించనున్నారు.

Biden
బైడెన్

లాస్​ ఏంజెలెస్​ మేయర్ ఎరిక్ గర్సెట్టీని భారత్​కు తదుపరి రాయబారిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe biden) ప్రకటించనున్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. వచ్చే వారంలో భారత్​తో పాటు చైనా, జపాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు అమెరికా రాయబారుల్ని నియమించనున్నట్లు వెల్లడించింది.

అయితే ఈ విషయంపై శ్వేతసౌధం అధికారికంగా వెల్లడించలేదు. తుది జాబితా విడుదల కాలేదని తెలిపింది. జనవరి 20నుంచి భారత్​కు అమెరికా రాయబారి పోస్టు ఖాళీగా ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ఎరిక్ గర్సెట్టీ.. బైడెన్(joe biden) ప్రచారానికి కో-ఛైర్మన్ గా వ్యవహరించారు.

ఇదీ చదవండి:Mehul Choksi: 'ఛోక్సీని భారత్​కు అప్పగించండి!'

ABOUT THE AUTHOR

...view details