తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫేస్​బుక్​పై దర్యాప్తునకు సిద్ధమైన అమెరికా

ఇతర సంస్థలతో పోటీని తట్టుకునేందుకు ఫేస్​బుక్​ ఏవైనా అక్రమాలకు పాల్పడుతోందా అన్న కోణంలో అమెరికా దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు ఫేస్​బుక్​ పనితీరును పరిశీలించేందుకు కొన్ని రాష్ట్రాల్లో అటార్నీ జనరళ్లను దర్యాప్తు అధికారులుగా నియమించింది.

By

Published : Sep 7, 2019, 5:05 AM IST

Updated : Sep 29, 2019, 5:45 PM IST

ఫేస్​బుక్​పై దర్యాప్తునకు సిద్ధమైన అమెరికా

సోషల్​ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​ ఇతర సంస్థల నుంచి గట్టి పోటీని ఎదర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులను ప్రమాదంలోకి పడేసేలా వ్యవహరిస్తుందా అని తెలుసుకునేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల్లో దర్యాప్తునకు ఆదేశించినట్లు న్యూయార్క్​ రాష్ట్ర అటార్నీ జనరల్​ లితిషియా జేమ్స్ తెలిపారు.

ఫేస్​బుక్​ చట్టాలను పాటిస్తూ, వినియోగదారులను గౌరవించాలని జేమ్స్​ స్పష్టం చేశారు. వినియోగదారుల భద్రత, సమాచారం కొరకు ఎటువంటి చర్యలు తీసుకుంది? ప్రకటనపై రుసుములను పెంచిందా?.. ఇలా అన్ని కోణాలలో పరిశీలిస్తామని తెలిపారు.

కొలరాడో, ఫ్లోరిడా, అయోవా, నెబ్రాస్కా, నార్త్ కరోలినా, ఒహియో, టెన్నెస్సీకి చెందిన అటార్నీ జనరల్​లు ఈ దర్యాప్తులో పాల్గొంటున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో సామాజిక మధ్యమాల చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు అమెరికా న్యాయ వ్యవస్థ ప్రకటించింది.

ఇదీ చూడండి:వెన్నెముకకు శస్త్ర చికిత్స చేసేందుకు రోబోలు

Last Updated : Sep 29, 2019, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details