తెలంగాణ

telangana

ETV Bharat / international

లిబియాలో పడవ బోల్తా... 150 మంది గల్లంతు

మధ్యదరా సముద్రంలో లిబియాకు చెందిన వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 150 మందికిపైగా గల్లంతయ్యారు. వీరంతా మరణించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

By

Published : Jul 26, 2019, 5:07 AM IST

లిబియాలో పడవ బోల్తా

లిబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యదరా సముద్రంలో సుమారు 300 మంది లిబియా వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గల్లంతయ్యారు. వీరంతా చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న లిబియా నావికాదళం మునిగిపోతున్న పడవ నుంచి 125 మందిని కాపాడారు.

గల్లంతైనవారి కోసం హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గాలిస్తున్నారు. ఈ 150 మంది మరణించినట్లయితే.. మధ్యధరా సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో అతి పెద్దది ఇదే అవుతుంది. ఈ ఏడాది మే నెలలో లిబియా నుంచి యూరప్‌కు బయల్దేరిన వలసదారుల ఓ పడవ బోల్తా పడగా 70 మంది మరణించారు. 2018 జనవరిలోనూ 64 మంది వలసదారులు చనిపోయారు.

మృత్యు వలసలు

లిబియాలో అంతర్గత పోరుతో అక్కడి ప్రజలు ఐరోపా బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 2017లో 3,139 మంది, 2018లో 2,297 మంది చనిపోయారు.

ఇదీ చూడండి: అఫ్గాన్​​లో బాంబుదాడులు- 10 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details