తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓటీటీ బాట పట్టిన బీటౌన్​ సినిమాలు.. ఇక థియేటర్ల హవా తగ్గేనా?

బీటౌన్​లో హిట్​ సినిమాల జోరు బాగా తగ్గిపోయింది. కరోనా కారణంగా ఎన్నో ఎదురుదెబ్బలను ఎదుర్కొన్న సినీ పరిశ్రమ మునుపటి పరిస్థితులకు మారేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఈ క్రమంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల చిత్ర యూనిట్లు సైతం వాటిని ఓటీటీలో రిలీజ్​ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నాయి.

By

Published : Nov 17, 2022, 8:30 AM IST

upcoming bollywood movies to be released in ott
upcoming bollywood movies to be released in ott

హిందీ చిత్రసీమలో విజయాల సందడి బాగా తగ్గిపోయింది. కరోనా తర్వాత పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చినా జనం థియేటర్లకు రావడం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. దీంతో కొన్ని సినిమాలు ఇప్పటికీ ఓటీటీ వైపే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా ఇద్దరి యువ కథానాయకుల చిత్రాలు ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించాయి ఆయా చిత్రబృందాలు.

'మిషన్‌..' జనవరిలో..: యువ కథా నాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'మిషన్‌ మజ్ను'. శంతను బగ్చీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రోనీ స్క్రూవాలా, గరిమ మెహతా, అమర్‌ బుటాలా నిర్మించారు. ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా జనవరిలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది. పాకిస్థాన్‌లో మన దేశం జరిపే కోవర్ట్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది.

గోవిందుడుది అదే దారి: విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'గోవింద్‌ నామ్‌ మేరా'. భూమి పెడ్నేకర్‌, కియారా అడ్వాణీ నాయికలు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని విక్కీ, కరణ్‌లు ఓ ఫన్నీ వీడియో ద్వారా తెలియజేశారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించారు. విక్కీ ప్రస్తుతం మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తోన్న సామ్‌ మానెక్షా బయోపిక్‌ 'సామ్‌ బహదూర్‌'లో నటిస్తున్నాడు. ఆ తర్వాత లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో సారా అలీఖాన్‌ హీరోయిన్‌గా ఓ సినిమా చేయనున్నాడు.

సాహసవీరుడి కథలో
పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ బొగ్గు గని ప్రమాదం నుంచి 64 మంది ప్రాణాల్ని కాపాడి గొప్ప మనిషిగా నిలిచారు జస్వంత్‌ సింగ్‌ గిల్‌. ఇప్పుడు ఆయన కథ తెరపైకి వస్తోంది. ప్రముఖ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ తెరపై సింగ్‌గా కనిపించనున్నారు. తాజాగా అక్షయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. పూజా ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ నిర్మించనున్న ఈ చిత్రాన్ని 'రుస్తుం' దర్శకుడు టిను సురేష్‌ దేశాయ్‌ తెరకెక్కించనున్నారు. తన సాహసానికి గుర్తుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న గిల్‌ 2019లో మరణించారు.

ABOUT THE AUTHOR

...view details