తెలంగాణ

telangana

సినిమా రంగంలోకి దిగిన ధోని.. దానితోనే ప్రారంభం!

By

Published : Oct 24, 2022, 10:58 PM IST

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరికొత్త వెంచర్​లోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు క్రికెట్​లో దిగ్గజ క్రీడాకారుడిగా పేరు సంపాదించుకున్న.. ధోని ఇకపై సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తన భార్యతో కలిసి ఈ వెంచర్​ను మొదలు పెట్టాడు. ధోని సంస్థలో మొదటగా తెరకెక్కనున్న సినిమా ఇదే.

dhoni entertainment
dhoni entertainment

ప్రముఖ స్టార్​ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోని తన బ్యాటింగ్​ స్టైల్​తో క్రికెట్​ దిగ్గజాలలో ఒకరిగా నిలిచారు. టీమ్​ ఇండియాకు కెప్టెన్సీ వహించిన ధోని.. 2007 ప్రపంచ కప్ ట్రోఫీ​ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్​కి కెప్టెన్​గా వ్యవహరించి అనేక విజయాలు సాధించారు. కొన్నేళ్ల క్రితం క్రికెట్​కు బైబై చెప్పిన ధోనీ తన ఫ్యాన్స్​తో అప్పుడప్పుడు మాత్రమే టచ్​లో ఉంటున్నారు. ఓ వైపు యాడ్స్​ చేస్తూ మరోవైపు వ్యవసాయం చేస్తూ బిజీ అయిన ధోని ఇప్పుడు మరింత బిజీ అవ్వనున్నారు.

ధోని ఎంటర్​టైన్​మెంట్స్​ అనే ప్రొడక్షన్​ హౌస్​ను స్థాపించిన ధోని అందులో ఇకపై తెలుగు, మలయాళ, తమిళ చిత్రాలను నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధోని సతీమణి సాక్షి సింగ్​ ధోని ఈ ప్రొడక్షన్​ హౌస్​ మేనేజింగ్ డైరెక్టర్​గా ఉన్నారు. కాగా ఈ సంస్థ ఇప్పటికే 'రోర్ ఆఫ్ ద లయన్', 'ది హిడెన్ హిందు', 'బ్లేజ్ టు గ్లోరీ' వంటి డాక్యుమెంటరీలను నిర్మించింది. ఈ సంస్థ ఇప్పుడు యాడ్​ ఫిలిమ్స్, షార్ట్​ ఫిలిమ్స్​, వెబ్ షోలు కూడా నిర్మిస్తోంది.

అయితే ఇకపై మెయిన్​స్ట్రీమ్ సినిమాలను కూడా నిర్మించనుంది. ఈ మేరకు ధోని ఎంటర్​టైన్​మెంట్స్ ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్​ అయిన సాక్షి సింగ్ ధోని ఆలోచనలోంచి పుట్టిన ఓ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ సినిమాకు 'అథర్వ' అనే నవల రాసిన రమేశ్​ తమిళ్​మణి దర్శకత్వం వహిస్తున్నారని పేర్కొంది. ఇక ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుందని ధోని ఎంటర్​టైన్​మెంట్ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ తెలిపింది. ఇందులో నటీనటులని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. "నేను సాక్షి రాసిన స్క్రిప్ట్​ చదివినప్పుడే తెలుసు.. ఇది స్పెషల్​ అని. ఈ కాన్సెప్ట్​ కొత్తది. ఇది ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా దీర్చిదిద్దేందుకు నా శాయశక్తులా కృషి చేశాను " అని తమిళ్​మణి అన్నారు. ఇదే కాకుండా సైన్స్​ ఫిక్షన్, క్రైమ్​, డ్రామా, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్​ లాంటి జోనర్లలో మంచి సినిమాలు తీయడానికి ఈ సంస్థ వివిధ రచయితలతో, దర్శకులతో చర్చలు జరుపుతోందని ప్రకటన తెలియజేసింది.

ఇవీ చదవండి :మళ్లీ పట్టాలెక్కనున్న పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్ట్.. ఈసారి బాలీవుడ్​లో!

కొత్త పోస్టర్లతో టాలీవుడ్​లో దీపావళి సందడి

ABOUT THE AUTHOR

...view details