తెలంగాణ

telangana

By

Published : Mar 18, 2021, 4:42 PM IST

ETV Bharat / crime

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. డ్రైవర్​పై దాడి

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న డ్రైవర్​పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండిగల్ పీఎస్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

attack on driver
డ్రైవర్​పై దాడి

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న డ్రైవర్​ రామచంద్రరాజు(47).. సూరారం రాజీవ్ గృహకల్ప 67వ బ్లాక్ వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తన వద్ద నుంచి అక్రమంగా డబ్బులు గుంజుకున్నారని రాజు పేర్కొన్నాడు. అడ్డు వచ్చిన తన కుమారుడిని కూడా కొట్టి దుండగులు పరారయ్యారని వివరించాడు.
గాయాలపాలైన రాజు దుండిగల్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో స్థానికంగా ఉన్న కొందరు యువకులు రాత్రి సమయంలో గంజాయి తాగుతూ దారిన వెళ్లేవారితో వాగ్వాదానికి దిగుతారని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details