తెలంగాణ

telangana

పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

By

Published : Jan 27, 2021, 2:03 PM IST

ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడికి భార్య, కుమారుడు(5) ఉన్నారు.

tractor overturned at chigurumamidi in Karimnagar district and driver died
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామ శివారులో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

బోల్తా పడిన ట్రాక్టర్

చిగురుమామిడి గ్రామానికి చెందిన వేల్పుల ఆంజనేయులు(30) తనకున్న పొలంలో ట్రాక్టర్​తో గొర్రు కొడుతుండగా అదుపుతప్పింది. అతనిపై బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు(5) ఉన్నారు. ఆంజనేయులు మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చల్లా మధుకర్ రెడ్డి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: అంత్యక్రియలకు హాజరై వస్తుండగా.. దుండగుల దాడి

ABOUT THE AUTHOR

...view details