తెలంగాణ

telangana

Builder Murder Case: విజయవాడలో బిల్డర్ దారుణహత్య.. సీసీ పుటేజీలో...

By

Published : Nov 1, 2021, 5:34 PM IST

విజయవాడలో దారుణ హత్య(Builder Murder Case) జరిగింది. పీతల అప్పలరాజు అనే బిల్డర్​ను గుర్తుతెలియని వ్యక్తులు అతని ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం రక్తపు మడుగులో పడి ఉందని వెల్లడించారు.

Builder Murder Case, vijayawada murder case
బిల్డర్ హత్యకేసు, విజయవాడ హత్యకేసు

ఆంధ్రప్రదేశ్​ విజయవాడ శివారు దేవినేని గాంధీపురంలో పీతల అప్పలరాజు అనే బిల్డర్​ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య(Builder Murder Case) చేశారు. మృతదేహం అతని ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. నిద్రిస్తున్న సమయంలోనే రాజును హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పీతల అప్పలరాజు కుటుంబం విశాఖలో ఉంటోందని పోలీసులు తెలిపారు.

హత్య కేసులో(Builder Murder Case) భాగంగా పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న విజయవాడ ఉత్తర మండల ఏసీపీ షేక్ షాను బృందం... డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలతో ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థికంగా స్థితిమంతుడైన బిల్డర్ అప్పలరాజు హత్యకు గల కారణాలపై స్థానికులను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్ధలానికి చేరుకున్న జాగిలాలు హత్యజరిగిన ప్రాంతం నుంచి దూరంగా ఉన్నా బ్రాందీ షాపు, గృహ సముదాయాల మధ్య తిరిగింది. మద్యం సేవించి అగంతకులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులోభాగంగానే సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఇప్పటికే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని ఏసీపీ తెలిపారు.

ఇదీ చదవండి:Ganja smuggling news: 60 కిలోల గంజాయి పట్టివేత.. ఆటోలో తరలిస్తుండగా సీజ్

ABOUT THE AUTHOR

...view details