తెలంగాణ

telangana

జవహర్​నగర్​లో బాలుడు అదృశ్యం.. పోలీసుల వెతుకులాట

By

Published : Mar 11, 2021, 1:03 PM IST

స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ జవహర్​నగర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

the-boy-who-went-to-play-with-friends-has-gone-missing-in-hyderabad
జవహర్​నగర్​లో బాలుడు అదృశ్యం

హైదరాబాద్​ జవహర్​నగర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఎనిమిదేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. బాలాజీనగర్​కు చెందిన వేణుగోపాల్ ఎలక్ట్రిషియన్​గా పనిచేస్తున్నాడు. అతని చిన్నకుమారుడు సిద్ధార్థ బుధవారం ఉదయం స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లి ఇప్పటికీ ఇంటికి తిరిగిరాలేదని వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న జవహర్​నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీకెమెరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఎవరికైనా తమ కుమారుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details