తెలంగాణ

telangana

ETV Bharat / crime

రూ.16 లక్షలతో కానిస్టేబుల్​ పరార్.. ఆపై గ్రూపులో మెసేజ్ ఏంటంటే?

"నా వైవాహిక జీవితం ఏం బాలేదు. నా జీవితమంటే నాకు అసహ్యం వేస్తోంది. ఒకర్ని చంపిన తర్వాత నేను చనిపోతాను.నన్ను మర్చిపో. గుడ్​బై" అంటూ ఓ కానిస్టేబుల్ పోలీస్ గ్రూపులో పెట్టిన సందేశం కలకలం రేపుతోంది. అంతకుముందే పోలీస్ స్టేషన్​లో ఉంచిన రూ.16 లక్షల నగదుతో ఉడాయించాడు.

By

Published : Sep 5, 2021, 9:19 AM IST

రూ.16 లక్షలతో కానిస్టేబుల్​ పరార్
రూ.16 లక్షలతో కానిస్టేబుల్​ పరార్

పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సొత్తుకు కాపాలా ఉండాల్సింది పోయి.. కాజేసి పరారయ్యాడు ఓ కానిస్టేబుల్. ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంచలన సృష్టించిన ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డబ్బులతో ఉడాయించిన కానిస్టేబుల్ జనార్ధన్ రెడ్డి.. పోలీసు గ్రూప్​లో పెట్టిన ఓ సందేశం కలకలం రేపుతోంది.

పోలీస్ గ్రూపులో కానిస్టేబుల్ మెసేజ్

"నేను అసలు ఏం బాలేను. ఐ హేట్ మై మ్యారిడ్ లైఫ్, ఐ హేట్ మై లైఫ్. నేను చనిపోయే ముందు ఓ వ్యక్తిని చంపుతాను. బీరువా తాళాలు నా క్వార్టర్స్​లోనే ఉన్నాయి" అంటూ మెసేజ్ చేశాడు. కానిస్టేబుల్ సందేశంతో మరింత అలర్ట్ అయిన పోలీసులు... అతడి కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details